తెలంగాణ

telangana

ETV Bharat / state

హరిత టూరిజం కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ

లాక్​డౌన్​ కారణంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న కార్మికులను ఆదుకోవటానికి పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. దీనిలో భాగంగా యాదాద్రిలో మెర్సీ ఎడ్సుకేషనల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో హరిత టూరిజంలో పనిచేసే కార్మికులకు 25 కిలోల బియ్యం బ్యాగులను పంపిణీ చేశారు.

By

Published : Jun 18, 2020, 8:03 AM IST

Essential Goods Supplied for poor peoples in Yadadri district
నిత్యావసర సరుకులు పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మెర్సీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హరిత టూరిజంలో పనిచేసే కార్మికులకు 25కిలోల బియ్యం బ్యాగులను పంపిణీ చేశారు. వీటితోపాటు మాస్కులు, శానిటైజర్స్​ను అందించారు.

ప్రజలందరూ ప్రభుత్వ సూచనలను పాటిస్తూ కరోనా వైరస్​ వ్యాప్తి నిర్మూలనకు పాటుపడాలని పేర్కొన్నారు. అత్యవసరంగా బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వెల్లడించారు. కార్యక్రమంలో హరిత టూరిజం మేనేజర్​ జంగయ్య, ట్రస్ట్​ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details