తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండాపురంలో జింకను చంపిన వేటగాళ్లు

జింకను వేటాడి చంపిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కొండాపురంలో జరిగింది. జింక మాంసం అమ్మారని ఓ అజ్ఞాత వ్యక్తి అటవీ అధికారులకు సమాచారం అందివ్వటం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

By

Published : Aug 1, 2019, 11:15 PM IST

జింక ఎముకలు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండాపురంలో జింకను వేటాడి తిన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం నీల రాములు పంట పొలంలో అడవి పందుల కోసం వలలు వేయగా జింక చిక్కుకుంది. జింక మాంసాన్ని నీల రాములు, నీల దశరథ, మన్నె నర్సింహా గ్రామంలోని 15 మందికి అమ్మారు. ఈ విషయాన్ని ఓ అజ్ఞాత వ్యక్తి అటవీ అధికారులకు సమాచారమందించారు. అటవీ శాఖ అధికారి కొండాపురం చేరుకుని జింకను వలవేసి పట్టుకున్న ప్రదేశాన్ని పరిశీలించి ఉచ్చుకు వాడిన ఇనుప తీగలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని పెంట కుప్పల నుంచి ఎముకలు సేకరించి ఫోరెన్సీ ల్యాబ్​కు పంపుతామన్నారు. నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details