తెలంగాణ

telangana

ETV Bharat / state

'సెల్​ టవర్​ను తొలగించాలని స్థానికుల ఆందోళన'

యాదాద్రి భువనగిరి జిల్లా  మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న సెల్​టవర్ తొలగించాలని స్థానికుల ఆందోళన చేపట్టారు.

By

Published : Aug 28, 2019, 1:36 PM IST

'సెల్​ టవర్​ను తొలగించాలని స్థానికుల ఆందోళన'

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​ మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటుచేసిన ఓ సెల్​టవర్​ను తొలగించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. రేడియేషన్ వల్ల అనేక మానసిక, శారీరక సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నామన్నారు. జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ టవర్ లీజు సమయం ముగిసినా టవర్​ను వినియోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కంపెనీ ప్రతినిధులు టవర్ వద్దకు రాగా వారిని స్థానికులు అడ్డుకోవడంతో వాగ్వాదం నెలకొంది. తమ లీజు గడువు ముగిసే వరకు ఈ టవర్ వినియోగంలోనే ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తేల్చి చెప్పారు. పోలీసులు వచ్చి ఇరు వర్గాలకు సర్దిచెప్పి ఆందోళనను విరమింప చేశారు.

ABOUT THE AUTHOR

...view details