అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట తహశీల్దార్ కార్యాలయం ముందు భాజపా నేతలు నిరసన చేపట్టారు. పంట నష్టం అంచనా వేసి ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రైతులను ఆదుకోవాలని.. యాదాద్రిలో భాజపా నిరసన
అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ యాదగిరిగుట్ట తహశీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నేతలు నిరసనకు దిగారు. నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని తహశీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.
రైతులను ఆదుకోవాలని.. యాదాద్రిలో భాజపా నిరసన
ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను, బాధితులను ఆదుకోవాలని యాదగిరిగుట్ట తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండిఃకరోనా కాలంలో.. మన విమానాశ్రయాలే భేష్!