తెలంగాణ

telangana

ETV Bharat / state

పీయూష్​ గోయల్​కు వినతిపత్రం ఇచ్చిన కోమటిరెడ్డి

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను దిల్లీలో కలిసారు. రైల్వే సమస్యలపై కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

పీయూష్​ గోయల్​కు వినతిపత్రం ఇచ్చిన కోమటిరెడ్డి

By

Published : Jul 24, 2019, 7:30 PM IST

భువనగిరి నియోజకవర్గంలో రైల్వే సమస్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​తో భేటీ అయ్యారు. శాతవాహన, పద్మావతి, గోదావరి, మచిలీపట్నం రైళ్లను భువనగిరి, జనగామ, ఆలేరు రైల్వేస్టేషన్‌లలో ఆపాలని వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది హైదరాబాద్​ వెళ్తుంటారని వినతిపత్రంలో పేర్కొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తుల సంఖ్య పెరుగుతున్న రైలు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో సర్వే చేయించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details