భువనగిరి నియోజకవర్గంలో రైల్వే సమస్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. శాతవాహన, పద్మావతి, గోదావరి, మచిలీపట్నం రైళ్లను భువనగిరి, జనగామ, ఆలేరు రైల్వేస్టేషన్లలో ఆపాలని వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది హైదరాబాద్ వెళ్తుంటారని వినతిపత్రంలో పేర్కొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తుల సంఖ్య పెరుగుతున్న రైలు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో సర్వే చేయించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
పీయూష్ గోయల్కు వినతిపత్రం ఇచ్చిన కోమటిరెడ్డి
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ను దిల్లీలో కలిసారు. రైల్వే సమస్యలపై కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.
పీయూష్ గోయల్కు వినతిపత్రం ఇచ్చిన కోమటిరెడ్డి