యాదాద్రి జిల్లాలో దీపావళి పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పుట్టపాకకు చెందిన పానుగంటి నరేందర్, చిలుకూరి శ్రీకాంత్ అనే ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై నారాయణపురం నుంచి స్వగ్రామానికి వస్తున్నారు. గ్రామ శివారులోకి రాగానే మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న అంబులెన్స్ బలంగా ఢీకొట్టింది. ద్విచక్రవాహనం అంబులెన్స్ కింద ఇరుక్కుపోగా... కొద్ది దూరం ఈడ్చుకుపోయింది. నరేందర్ అంబులెన్స్ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాంత్కు తీవ్ర గాయాలు కాగా... చౌటుప్పల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల నార్కట్ పల్లిలోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇద్దరు యువకులు చేనేత పని చేస్తున్నారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
విషాదం: అంబులెన్స్ కింద పడి యువకుడు మృతి...
ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్లో తీసుకెళ్తారు. కానీ ఇక్కడ ఆ ప్రమాదమే అంబులెన్స్ వల్ల జరిగింది. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై అతివేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న అంబులెన్స్ని ఢీకొట్టారు. అంబులెన్స్ కింద ఇరుక్కొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. యాదాద్రి జిల్లా పుట్టపాకలో పండుగపూట విషాదఛాయలు అలుముకున్నాయి.
AMBULANCE AND BIKE ACCIDENT AT PUTTAPAKA