తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి: నరేందర్

పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు గెలిచి కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషిస్తామన్నారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్. పసునూరి దయాకర్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

By

Published : Mar 28, 2019, 6:17 PM IST

తెరాస కార్యకర్తల సమావేశం

వరంగల్ పార్లమెంట్​ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్​ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్. 16 లోక్​సభ సీట్లు గెలిచి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తామని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో భాజపా, కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. పసునూరి దయాకర్​ను భారీ మెజార్టీతో గెలిపించడం కోసం తెరాస కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కరీమాబాద్​లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, గుండు సుధారాణి, ఇతర కార్యకర్తలు హాజరయ్యారు.

తెరాస కార్యకర్తల సమావేశం

ABOUT THE AUTHOR

...view details