తెలంగాణ

telangana

ETV Bharat / state

చీకటి గదిలో పోలింగ్... ఇబ్బంది పడుతున్న ఓటర్లు

ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు... ఓటర్లకు అన్ని సౌకర్యాలు అందిస్తానన్న ఎన్నికల సంఘం పలు చోట్ల కనీస వసతులు కూడా కల్పించలేదు. వరంగల్ అర్బన్ ధర్మసాగర్​లో చీకటి గదిలో ఓట్లు వేసేందుకు ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు.

By

Published : Apr 11, 2019, 8:55 AM IST

కనీస సౌకర్యాలు లేని పోలింగ్ కేంద్రం

వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని పోలింగ్ కేంద్రంలో అధికారులు కనీస వసతులను ఏర్పాటు చేయలేదు. స్థానిక జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో చీకటి గదిలోనే మాక్ పోలింగ్​ నిర్వహించారు. వృద్ధులు, దివ్యాంగులను లోపలికి తీసుకువెళ్లడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పోలింగ్ మొదలైన తర్వాత కూడా తెరాస మినహా ఏ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు కూడా కేంద్రం వద్దకు రాలేదు. తహసీల్దార్ వరలక్ష్మి, వీఆర్వో ప్రవీణ్ ఓటర్లకు పుష్పాలను అందించి స్వాగతం పలికారు.

కనీస సౌకర్యాలు లేని పోలింగ్ కేంద్రం

ABOUT THE AUTHOR

...view details