తెలంగాణ

telangana

By

Published : Aug 23, 2019, 9:15 AM IST

ETV Bharat / state

'పండుగలు సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక'

ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఒడితెల సతీష్ కుమార్ తీజ్‌ ఉత్సవాల్లో పాల్గొన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఎర్రబెల్లి తండాలో నిర్వహించిన పండుగలో ముఖ్య అతిథులుగా హాజరై గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు.

'పండుగలు సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక'

వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి తండాలో గిరిజన తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి స్టేషన్‌ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గిరిజన మహిళలు, యువకులు వారికి ఘనస్వాగతం పలికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పండుగలు సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ప్రభుత్వం అన్ని కులాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అనంతరం గోధుమ బుట్టలు ఎత్తుకొని మహిళలతో కలిసి నృత్యాలు చేశారు.

'పండుగలు సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details