ఎమ్మెల్సీ ఎన్నికల్లో...విభజన చట్టంలో ఇచ్చిన హామీలు...నేతలకు ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో రైల్వేకోచ్ ఏర్పాటుపై ఇచ్చిన హామీపై వెనక్కి తగ్గి తెలంగాణ పట్ల కేంద్రం మరోసారి వివక్ష చూపుతోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాజీపేటలో రైల్వే కోచ్ అవసరం లేదన్న వైఖరిని కేంద్రం ప్రభుత్వం మార్చుకోక పోతే... రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై తెరాస ఎంపీలు కేంద్రాన్ని నిలదీస్తారని తెలిపారు. ఉద్యోగాలపై గగ్గోలు చేస్తున్న భాజపా నేతలు.. రైల్వేను ప్రైవేటీకరణ చేస్తే కొత్త నియామక ప్రకటనలు ఎలా వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను భాజపా ఇంకెంత కాలం మోసం చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు రాకుండాపోతుంటే.. ఏం చేస్తున్నారని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ భాజపా నేతలను ప్రశ్నించారు.
అప్పుడు స్పందించకుండా..
తెరాస వల్లే కోచ్ తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ రాకుండా పోయిందని భాజపా ఆరోపిస్తోంది. సరైన సమయంలో స్పందించకుండా...ఇప్పుడు విమర్శలు చేయడమేంటని....భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెరాస నేతలను ప్రశ్నించారు.