తెలంగాణ

telangana

By

Published : Oct 29, 2020, 12:37 PM IST

ETV Bharat / state

వరంగల్​లో పేద ఆర్యవైశ్య బాలికల వసతి గృహానికి భూమి పూజ

పేద ఆర్యవైశ్య బాలికల కోసం వసతి గృహా నిర్మాణానికి వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్​రావు భూమి పూజ చేశారు. పట్టణంలోని 26వ డివిజన్​లోని డాల్ఫిన్ గల్లీ ప్రాంతంలో భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

hostel building construction stareted for poor girls in Aryavysya community in warangal
వరంగల్​లో పేద ఆర్యవైశ్య బాలికల వసతి గృహానికి భూమి పూజ

నిరుపేద ఆర్యవైశ్య బాలికల కోసం వసతి గృహాన్ని నిర్మిస్తున్నామని వరంగల్ మేయర్ గుండా ప్రకాశరావు తెలిపారు. పట్టణంలోని 26 డివిజన్​ పరిధిలో డాల్ఫిన్​ గల్లీ ప్రాంతంలో నూతనంగా నిర్మించబోయే భవనానికి ఆయన భూమి పూజ చేశారు. రాబోయే కాలంలో ఇది గొప్ప ఆస్తిగా మిగిలిపోతుందని అన్నారు.

వడ్డీరహిత డొనేషన్లపై వచ్చే ఆదాయంతో ప్రస్తుత భవన నిర్మాణం చేపడుతున్నామని మేయర్ తెలిపారు. కమర్షియల్ ప్రాంతంలో నిర్మించటం వల్ల ఏడాదిలోనే వారికి డబ్బులను తిరిగి చెల్లిస్తామని అన్నారు. అద్దెల ద్వారా వచ్చే ఆదాయంతోనే వసతి గృహాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. దీని వల్ల అనేక మంది నిరుపేద ఆర్యవైశ్య బాలికలకు లబ్ధి చేకూరుతుందని మేయర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:వరంగల్​లో 80 శాతం ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తి: పమేలా సత్పతి

ABOUT THE AUTHOR

...view details