తెలంగాణ

telangana

సమస్యలను పరిష్కరించండి : విద్యుత్ ఉద్యోగులు

By

Published : Feb 25, 2021, 1:39 PM IST

వరంగల్​లో జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. హన్మకొండలోని విద్యుత్ ఏస్ఈ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు.

Electricity workers in Warangal have raised concerns, demanding that their problems be resolved
సమస్యలను పరిష్కరించండి : విద్యుత్ ఉద్యోగులు

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్​లో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె చేసేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు.

అందులో భాగంగా.. హన్మకొండలోని విద్యుత్ ఏస్ఈ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు నిరాహార దీక్షలు చేపట్టారు. ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. సబ్ స్టేషన్​లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే.. పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:గానుగ నూనెతో ఆరోగ్యం... భారీగా పెరుగుతున్న వాడకం

ABOUT THE AUTHOR

...view details