తెలంగాణ

telangana

ధరణి పోర్టల్​తో పారదర్శకంగా సేవలు: వరంగల్​ తహసీల్దార్​

ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు భూ సంబంధిత సేవలు పారదర్శకంగా మరింత వేగవంతం అవుతాయని వరంగల్ తహసీల్దార్​ ఇక్బాల్ తెలిపారు. వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ముందుగా మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. నూతన విధానంతో సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతోందని వెల్లడించారు.

By

Published : Nov 2, 2020, 4:48 PM IST

Published : Nov 2, 2020, 4:48 PM IST

ధరణి పోర్టల్​తో పారదర్శకంగా సేవలు: వరంగల్​ తహసీల్దార్​
ధరణి పోర్టల్​తో పారదర్శకంగా సేవలు: వరంగల్​ తహసీల్దార్​

ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు భూ సంబంధిత సేవలు పారదర్శకంగా మరింత వేగవంతం అవుతాయని వరంగల్ తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్​ ఇక్బాల్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియను వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రారంభించారు.

వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ముందుగా మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని ​ఇక్బాల్ పేర్కొన్నారు. నూతన విధానంతో సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతోందని తెలిపారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ధరణి పోర్టల్​పై నగరవాసులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ధరణి పోర్టల్​ ప్రారంభించిన వరంగల్​ తహసీల్దార్​

ఇదీ చదవండి:తొలిరోజు ధరణి సేవలు.. 15నిమిషాల్లో నమోదు పూర్తి

ABOUT THE AUTHOR

...view details