తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్ నో మూమెంట్ జోన్​లో కఠినంగా లాక్​డౌన్

వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా కేసులు అధికమవుతోన్న నేపథ్యంలో పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో నో మూమెంట్​తో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.

By

Published : Apr 26, 2020, 2:02 PM IST

నో మూమెంట్ జోన్​లో పకడ్బందీ చర్యలు
నో మూమెంట్ జోన్​లో పకడ్బందీ చర్యలు

వరంగల్ అర్బన్ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు అధికారులు నో మూమెంట్ జోన్లను ఏర్పాటు చేసి లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.

తాజాగా వెలుగు చూసిన కేసులతో అధికారులు మరింత ముందుచూపుతో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్, శాంతినగర్, శాలిని నగర్​లను జోన్​ల కింద ఏర్పాటు చేశారు. ఆయా కాలనీల నుంచి బయటకు ఎవరూ రాకుండా పోలీసులు రహదారులకు అడ్డంగా కంచెలను ఏర్పాటు చేశారు. కాలనీ వాసుల కోసం నిత్యవసర వస్తువులను మున్సిపల్ సిబ్బంది అందజేస్తున్నారు.

ఇవీ చూడండి : ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

ABOUT THE AUTHOR

...view details