తెలంగాణ

telangana

ETV Bharat / state

వారికి మాత్రమే ధ్రువపత్రాలు జారీ...

ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు వచ్చేలా వరంగల్​ అర్బన్​ జిల్లా భీమదేవరపల్లి జడ్పీటీసీ, సర్పంచ్​ కొత్త విధానాన్ని చేపట్టారు. ప్రైవేట్​ బడుల్లో చదివే పిల్లలకు గ్రామపంచాయతీ నుంచి ధ్రువపత్రాలు అందజేయబోమని తేల్చిచెప్పారు.

By

Published : Jun 25, 2019, 12:16 PM IST

వారికి మాత్రమే ధ్రువపత్రాలు

వారికి మాత్రమే ధ్రువపత్రాలు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు వరంగల్​ అర్బన్​ జిల్లా భీమదేవరపల్లి గ్రామస్థులు ఒక అడుగు ముందుకేశారు. ప్రభుత్వ బడుల్లో చదవని విద్యార్థులకు గ్రామపంచాయతీ నుంచి ఎలాంటి ధ్రువపత్రాలను ఇవ్వబోమని ప్రచారం నిర్వహించారు. గ్రామపంచాయతీల్లో తీసుకున్న ధ్రువపత్రాలకు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయంటూ గోడప్రతులు అందించారు. ప్రైవేట్​ పాఠశాలల వాహనాలను గ్రామంలోకి అనుమతించేదిలేదని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమం కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీ రవీందర్​, సర్పంచ్​ ఆధ్వర్యంలో జరిగింది.

ABOUT THE AUTHOR

...view details