వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో భాజపా శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. నాలుగు లోక్సభ స్థానాల్లో కాషాయ జెండా ఎగిరిందని టపాసులు కాల్చి సందడి చేశారు. మోదీ అవినీతి రహిత పాలన నచ్చే ప్రజలు మళ్లీ భాజపాను గెలిపించారని మాజీ ఎమ్మెల్యే ధర్మారావు అన్నారు. 'ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్' నినాదాన్ని నిజం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
మోదీ విజయం... భాజపా సంబురం
గత ఐదేళ్లలో సుస్థిర పాలన అందించినందుకే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రజలు తిరిగి భాజపాకు పట్టం కట్టారని మాజీ ఎమ్మెల్యే ధర్మారావు అన్నారు.
మోదీ విజయం... భాజపా సంబురం