తెలంగాణ

telangana

By

Published : Jun 1, 2021, 3:38 PM IST

ETV Bharat / state

నకిలీ విత్తనాల నియంత్రణపై వ్యవసాయ అధికారులకు అవగాహన

నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారులకు కల్తీ విత్తనాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Telangana news
కరీంనగర్​ వార్తలు

రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై చీటింగ్ కేసుతో పాటు, సీడ్ కంట్రోల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్​ తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన విత్తన సంస్థల నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసేలా రైతులను వ్యవసాయ అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారులకు కల్తీ విత్తనాల నియంత్రణపై అవగాహన కల్పించారు.

వానాకాలం ప్రారంభం అవుతున్నందున సీపీ తరుణ్ జోషి ఆదేశాలతో కల్తీ విత్తనాల కట్టడికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు నష్టపోకుండా వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందని సూచించారు.

ఇదీ చూడండి:Viral Video: బాలుడ్ని చావబాదిన మాజీ పోలీస్​

ABOUT THE AUTHOR

...view details