తెలంగాణ

telangana

ETV Bharat / state

నిట్​లో ర్యాగింగ్​... ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్​​

ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కళాశాలల్లో ర్యాగింగ్​ భూతం పడగ విప్పుతూనే ఉంది. వరంగల్​ నిట్​లో జూనియర్లపై ర్యాగింగ్​కు పాల్పడ్డ ఐదుగురు సీనియర్​ విద్యార్థులపై సస్పెన్షన్​ వేటు పడింది.

By

Published : Mar 29, 2019, 10:22 AM IST

ర్యాగింగ్​

వరంగల్​లో ర్యాగింగ్​కు పాల్పడ్డ విద్యార్థుల సస్పెన్షన్​
వరంగల్​లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్​లో ర్యాగింగ్​ ఆరోపణలతో ఐదుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది. తమపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్​కు పాల్పడుతున్నారని జూనియర్ విద్యార్థులు విద్యా సంస్థ అధికారులకు పదిరోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ర్యాగింగ్​కు పాల్పడుతున్న విద్యార్థులను గుర్తించి సస్పెండ్ చేశారు.

కేసు నమోదు

సస్పెండ్ అయిన వారిలో ముగ్గురు తృతీయ సంవత్సరం, ఇద్దరు చివరి సంవత్సరం విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ర్యాగింగ్​కి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి :కాంగ్రెస్​ సమావేశంలో.. కుర్చీల కోసం కొట్లాట

ABOUT THE AUTHOR

...view details