తెలంగాణ

telangana

ETV Bharat / state

బిల్డింగ్​లు కట్టి వదిలేస్తారా..! ఎస్​ఎఫ్ఐ కన్నెర్ర

పరకాలలో దాదాపు కోటి రూపాయలతో నిర్మించిన పాలిటెక్నిక్ భవనాలు ప్రారంభోత్సవానికి నోచుకోకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయని... ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు.

By

Published : Aug 8, 2019, 7:06 PM IST

ఎస్​ఎఫ్ఐ కన్నెర్ర

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలోని పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలు నిరుపయోగంగా ఉన్నాయని ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. రెండు సంవత్సరాల క్రితం దాదాపు కోటి రూపాయలతో నిర్మించిన భవనాలు ప్రారంభోత్సవానికి నోచుకోకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయని మండిపడ్డారు. పాలిటెక్నిక్ వసతిగృహాలను వెంటనే ఉపయోగంలోకి తీసుకురాకపోతే.. నిరాహార దీక్షకు దిగుతామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు.

ఎస్​ఎఫ్ఐ కన్నెర్ర

ABOUT THE AUTHOR

...view details