తెలంగాణ

telangana

ETV Bharat / state

యశోదకి రవళి

ప్రేమించాడు. ఒప్పుకోలేదని పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. గమనించిన స్థానికులు బాధితురాలని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల సికింద్రాబాద్​లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు.

By

Published : Feb 27, 2019, 5:46 PM IST

రవళిని యశోదకి తరలింపు

రవళిని యశోదకి తరలింపు
వరంగల్‌లో ప్రేమోన్మాది దాడి ఘటనలో బాధితురాలిని సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు. రవళి తన ప్రేమను అంగీకరించలేదని కళాశాలకు వెళ్తుండగా నడిరోడ్డుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. వెంటనే బాధితురాలిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయం కావడం వల్ల సికింద్రాబాద్​లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు.

చికిత్స పొందుతున్న రవళిని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డితో పాటు సీపీ రవిందర్ పరామర్శించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కఠినంగా శిక్షిస్తామని సీపీ స్పష్టం చేశారు. యశోద ఆస్పత్రి యాజమాన్యంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు మాట్లాడారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. సాయంత్రం ఆస్పత్రికి వెళ్లి రవళి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకోనున్నారు.

ఇవీ చదవండి:

యువతికి నిప్పంటించాడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details