తెలంగాణ

telangana

By

Published : Feb 1, 2020, 5:55 PM IST

ETV Bharat / state

గులాబీలు అందించి అభినందించిన అధికారులు

జాతీయ 31వ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు రవాణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న వారికి గులాబీలు అందించి అభినందించారు.

Officers who offer and appreciate roses helmet vehicle members at narsampet
గులాబీలు అందించి అభినందించిన అధికారులు

రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో విద్యార్థులచే ర్యాలీ చేశారు. వరంగల్ రోడ్ కూడలి నుంచి అమరవీరుల స్థూపంవరకు ర్యాలీ కొనసాగించారు. మార్గమధ్యలో హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న వారికి గులాబీలు అందించి అభినందించారు.

వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని రవాణ శాఖ అధికారులు అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువమంది యువకులే మృత్యువాత పడుతున్నారని వెల్లడించారు.

గులాబీలు అందించి అభినందించిన అధికారులు

ఇదీ చూడండి :బ్యాంకు నుంచి నగదు, నగలు మాయం!

ABOUT THE AUTHOR

...view details