తెలంగాణ

telangana

ETV Bharat / state

​టవర్​ ఎక్కి పెళ్లి చేసుకుంది

వారిద్దరూ 10 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. యువకుడు పెళ్లికి నిరాకరించి వేరే యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు నిన్న సెల్​ టవర్​ ఎక్కి పెళ్లి చేయాలని డిమాండ్ చేసింది. పోలీసులు యువకుడికి కౌన్సిలింగ్​ ఇచ్చి వివాహానికి ఒప్పించి కథ సుఖాంతం చేశారు.

By

Published : Mar 6, 2019, 11:23 AM IST

Updated : Mar 6, 2019, 1:21 PM IST

పెళ్లి చేసిన పోలీసులు

సెల్​ టవర్​ ఎక్కిన యువతికి న్యాయం చేసిన పోలీసులు
ప్రేమకోసం పోరాడిన యువతికి చివరికి న్యాయం దక్కింది. కోరుకున్న యువకుడితో వివాహం చేయాలని నిన్న సెల్​ టవర్​ ఎక్కిన మాలిక పోలీసుల సమక్షంలో ప్రియుడు మోషేను పెళ్లి చేసుకుంది.

ఏం జరిగింది...

వరంగల్​ జిల్లా హసన్ పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన మోషే అదే గ్రామానికి చెందిన మాలికతో గత పదేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్నాడు. కొన్ని రోజులుగా మాలిక పెళ్లి చేసుకుందామని అడిగేసరికి ముఖం చాటేశాడు. న్యాయం చేయాలని కోరుతూ షీ టీంను ఆశ్రయించింది. అక్కడ తనకు న్యాయం జరగడం లేదని.. నిన్న గ్రామంలోని సెల్ టవర్ ఎక్కింది.

ఉత్కంఠ పరిణామాల మధ్య...

ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ చంద్రయ్య ఆమెతో చర్చించారు. మోషేకు కౌన్సిలింగ్​ ఇచ్చారు. అనంతరం పెళ్లికి యువకుడు అంగీకరించాడు. మాలిక సెల్ టవర్​ దిగింది. రాత్రి 9 గంటలకు పోలీసులు వారి వివాహం జరిపించారు.
Last Updated : Mar 6, 2019, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details