తెలంగాణ

telangana

ETV Bharat / state

శిల్ప కళ బాగుంది... కల్లు రుచీ అదిరింది...!

మన శిల్ప సంపదను చూసేందుకు సముద్రాలు దాటి వచ్చారు. శిల్ప కళను చూసి ఆశ్చర్య పోయారు. అంతేనా... తాటి కల్లు రుచికి ఫిదా అయ్యారు.

By

Published : Feb 10, 2019, 8:13 PM IST

Updated : Feb 25, 2019, 5:49 PM IST

గణపేశ్వరాలయంలో విదేశీయుల యోగా...

గణపేశ్వరాలయంలో విదేశీయుల యోగా...
జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురంలో జర్మనీ దేశస్థులు సందడి చేశారు. సుమారు 10 రోజులుగా వరంగల్​లోని పురాతన ఆలయాలను సందర్శిస్తున్న 50 మంది విదేశీయులు... గణపేశ్వరాలయాన్ని చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ శిల్ప సంపదను ఆసక్తిగా తిలకించారు. జర్మనీకి చెందిన శ్రీసాయి ట్రస్టు ప్రాణికల్​ యోగా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు.
ఆలయ సమీపంలో వున్న తాటి వనం వద్ద కల్లు సేవించారు. అద్భుతంగా వుందంటూ కితాబిచ్చారు. గీత కార్మికులు చెట్లను ఎక్కడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
Last Updated : Feb 25, 2019, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details