తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల నిర్వహణపై జాయింట్ కలెక్టర్ సమీక్ష

ప్రాదేశిక ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ కృషి చేయాలని వరంగల్ గ్రామీణ జిల్లా జాయింట్ కలెక్టర్ మహేందర్ ఆదేశించారు. పరకాలలో ఎమ్మార్వో, వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు.

By

Published : May 7, 2019, 12:49 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల ఆర్డీవో కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో ఎన్నికలపై సమీక్షా సమావేశం జరిగింది. ఎమ్మార్వో, వీఆర్వోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ సమక్షంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసులకు ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ బూత్​లను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని మహేందర్ సూచించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా అందరూ కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

జాయింట్ కలెక్టర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details