తెలంగాణ

telangana

ETV Bharat / state

అర్హులకు డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ల కేటాయింపు

వరంగల్ గ్రామీణ జిల్లాలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోంది. విడతల వారిగా అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులు వడివడిగా జరుగుతున్నాయి. త్వరలో అర్హులందరికీ డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు.

By

Published : Jul 18, 2020, 7:25 PM IST

Double bed room houses Allocation In Warangal Rural District
అర్హులైన పేదలకు డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ల కేటాయింపు..

వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలో అధికారులు అర్హులకు ప్రభుత్వ డబుల్ బెడ్​రూమ్ ఇళ్లు కేటాయించారు. లాటరీ పద్దతి ద్వారా డ్రా తీసి 40 మంది అర్హులకు నిర్మాణం పూర్తయిన ఇండ్లను కేటాయించారు. నిలువ నీడలేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్న రాయపర్తి వాసులకు ప్రభుత్వ డబుల్​ బెడ్​ రూమ్​ల కేటాయించడం వల్ల రాయపర్తి వాసులు ఆనందం వ్యక్తం చేశారు.

తమకు ఇళ్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్​, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. మంచి రోజు చూసుకుని మంత్రి చేతులమీదుగా గృహప్రవేశం చేయనున్నారు.

ఇదీ చూడండి :రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు

ABOUT THE AUTHOR

...view details