తెలంగాణ

telangana

కోదాడ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిపై దాడికి నిరసనగా ఆందోళన

సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిపై పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే కిరణ్ కుమార్ అనే వ్యక్తి మృతిచెందాడని ఆరోపించారు.

By

Published : Sep 18, 2020, 5:34 PM IST

Published : Sep 18, 2020, 5:34 PM IST

kodada hospital staff were assaulted by patient's relatives in suryapeta district
కోదాడ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిపై దాడికి నిరసనగా ఆందోళన

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి గుండెపోటుతో ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. కిరణ్​కు వైద్య పరీక్షలు నిర్వహించిన సిబ్బంది.. అప్పటికే అతను మరణించాడని తెలిపారు. ఆగ్రహానికి లోనైన కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందిపై దాడికి దిగారు. వారి నిర్లక్ష్యం వల్లే కిరణ్ మృతి చెందాడని ఆరోపించారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి.

కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్యులపై దాడికి నిరసనగా వైద్య సిబ్బంది ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. తక్షణమే తమపై దాడి చేసిన వారిని పట్టుకుని న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details