తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాదేశిక ప్రచారంలో ఉత్తమ్​ సతీమణి

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్​ పద్మావతి రెడ్డి ప్రాదేశిక ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్​ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

By

Published : May 8, 2019, 12:39 PM IST

ప్రాదేశిక ప్రచారంలో ఉత్తమ్​ సతీమణి

ప్రాదేశిక ప్రచారంలో ఉత్తమ్​ సతీమణి

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని ఖానాపురం, అమీనాబాద్, బొజ్జగూడెం తండాలో కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్​ పద్మావతి రెడ్డి ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కోదాడ ఎమ్మెల్యేగా ఓటమి తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలవడం వల్ల చాలా సంతోషం కలిగిందని ఆమె అన్నారు. ఈ ప్రాదేశిక ఎన్నికల్లో కూడా పంచాయతీ ఎన్నికల మాదిరి విజయాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్​ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.

ABOUT THE AUTHOR

...view details