తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు చేయట్లేదని రైతుల ఆందోళన

సూర్యాపేట జిల్లాలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ జాతీయ రహదారిపై అన్నదాతలు రాస్తారోకో చేపట్టారు. రైతులు రోడ్డుపై బైఠాయించడం వల్ల భారీగా ట్రాఫిక్​ నిలిచిపోయింది. పోలీసులు చేరుకుని రైతులను శాంతింపజేశారు.

By

Published : Apr 22, 2019, 7:54 PM IST

ధాన్యం కొనుగోలు చేయట్లేదని రైతుల ఆందోళన

ఐకేపీ కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతులు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సూర్యాపేట సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐకేపీ కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులు వారం రోజులుగా విక్రయాల కోసం ఎదురుచూస్తున్నారు. సంచుల కొరత ఉందంటూ.. ఐకేపీ నిర్వాహకులు కొనుగోళ్లు జరపడం లేదని అన్నదాతలు ఆగ్రహించారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు చేరుకుని రైతులను శాంతింపచేశారు. ఐకేపీ కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం తూకాలు వేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు.

ధాన్యం కొనుగోలు చేయట్లేదని రైతుల ఆందోళన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details