తెలంగాణ

telangana

By

Published : Aug 12, 2020, 6:08 PM IST

ETV Bharat / state

హమాలీలకు వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ ధర్నా

సూర్యాపేట జిల్లా కోదాడలో సివిల్ సప్లై హమాలీలకు వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

హమాలీలకు వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ ధర్నా
హమాలీలకు వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ ధర్నా

సూర్యాపేట జిల్లా కోదాడలో సివిల్ సప్లై హమాలీలకు వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, స్విపర్లకు రూ. 17, 500 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లై హమాలీలను ప్రభుత్వం గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాస్ పేర్కొన్నారు. సివిల్ సప్లై హామలీల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details