తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్పంచ్​ తల్లిదండ్రులు దుర్మరణం

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా భార్యాభర్తలిద్దరూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సిద్దిపేట జిల్లా వర్గల్​ మండలం రాజీవ్​ రహదారిపై మూలమలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు యాదాద్రి జిల్లా జ్వాల గ్రామ సర్పంచ్​ తల్లిదండ్రులుగా పోలీసులు గుర్తించారు.

By

Published : Jun 6, 2019, 3:26 PM IST

సర్పంచ్​ తల్లిదండ్రులు దుర్మరణం


సిద్దిపేట జిల్లా వర్గల్​ మండలం రాజీవ్​ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. బంధువుల ఇంట్లో శుభాకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి చౌరస్తా వద్ద మూలమలుపు తిరిగే క్రమంలో సిద్దిపేట నుంచి హైదరాబాద్​ వెళ్తున్న బొలెరే వాహనం స్కూటీని ఢీకొంది. భార్యాభర్తలు వనవాస రెడ్డి, అంజమ్మ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు యాదాద్రి జిల్లా రాజపేట మండలం జ్వాల గ్రామ సర్పంచ్​ మధుసూదన్​ రెడ్డి తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సర్పంచ్​ తల్లిదండ్రులు దుర్మరణం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details