సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి గ్రామ కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్ గ్రామ ప్రజలకు కాషాయ వితరణ చేశారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు బాధ్యతగా మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటించాలని సూచించారు.
కరోనా కట్టడికి వ్యక్తిగత జాగ్రత్తే మందు...
కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా దుంపలపల్లి గ్రామ కౌన్సిలర్ ప్రజలకు కాషాయ వితరణ చేశారు. ప్రతి ఒక్కరూ తగుజాగ్రత్తలు పాటించాలని.. వేడినీటిని తాగాలని సూచించారు.
దుంపలపల్లి గ్రామ కౌన్సిలర్.. కషాయ వితరణ
తరచూ వేడినీటిని తాగాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్తోపాటు గ్రామ సర్పంచ్, తెరాస నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :పీఎస్కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు