తెలంగాణ

telangana

ETV Bharat / state

రాహులే ప్రధాని: రేవంత్

ఓ కేసు విచారణ కోసం సిద్దిపేట కోర్టుకు కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి హాజరయ్యారు. అనంతరం... పట్టణంలో ​ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. 30 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబ సభ్యున్ని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

By

Published : Mar 2, 2019, 2:56 PM IST

సిద్దిపేటలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రేవంత్​

రైతులకు అండగా నిలిస్తే తనపై అక్రమంగా కేసులు పెట్టారని రేవంత్ ఆరోపించారు. గతంలో రంగనాయక సాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా దీక్షలో పాల్గొనందుకు కేసు పెట్టడాన్ని తప్పుపట్టారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పాలని ఆయన కేసీఆర్​ను డిమాండ్​ చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని రాహుల్ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

సిద్దిపేటలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రేవంత్​

ABOUT THE AUTHOR

...view details