తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాక బరిలో రఘునందన్​ రావు.. ప్రకటించిన పార్టీ అధిష్ఠానం

దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా ఎం.రఘునందన్ రావును ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేసిన రఘునందన్​ రావు.. అభ్యర్థిగా తన పేరు ఖరారు కావటంతో మరింత బీజీగా మారారు. తెరాస అభ్యర్థిగా సోలిపేట సుజాత పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్​ పార్టీ వారు ఇంక అభ్యర్థిని ప్రకటించలేదు.

By

Published : Oct 7, 2020, 12:07 AM IST

దుబ్బాక బరిలో రఘునందన్​ రావు.. ప్రకటించిన పార్టీ అధిష్ఠానం
దుబ్బాక బరిలో రఘునందన్​ రావు.. ప్రకటించిన పార్టీ అధిష్ఠానం

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా ఎం.రఘునందన్ రావును అధిష్ఠానం ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు నుంచే రఘునందన్ రావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. శనివారం దుబ్బాక ఉప ఎన్నికపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రఘునందన్ రావు పేరు దాదాపు ఖరారైంది. మంగళవారం జాతీయ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది.

అభ్యర్థిని అధికారికంగా ప్రకటించక ముందే ప్రచారంలో దూసుకెళ్లిన కమలనాథులు ఇప్పుడు మరింత హోరెత్తించనున్నారు. తెరాస అభ్యర్థిగా సోలిపేట సుజాత పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్​ పార్టీ వారు ఇంక అభ్యర్థిని ప్రకటించలేదు.

ఇదీ చదవండి:'ఏపీ ప్రాజెక్టులు ఆపకపోతే.. అలంపూర్-పెద్దమారూర్ వద్ద ఆనకట్ట నిర్మిస్తాం'

ABOUT THE AUTHOR

...view details