దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రెండో స్థానం కోసం తెరాస, భాజపా పోటీపడుతున్నాయని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎన్నికల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ప్రచారంలో భాగంగా చేనేత సంఘాన్ని సందర్శించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.
" మంత్రి హరీశ్రావు అభ్యర్థిని కాదు నన్ను చూసి ఓటు వేయండి అంటున్నారు. కానీ మేము అభ్యర్థిని చూసి ఓటు వేయండి అంటున్నాం. గతంలో చెరుకు ముత్యంరెడ్డి నిజాయతీగా పని చేశారు. వారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి అలాగే పని చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే దుబ్బాక ప్రాంతం బాగుపడుతుంది."
-ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు