తెలంగాణ

telangana

ETV Bharat / state

పింఛన్ కోసం వచ్చి.. కాలువలో పడిన అవ్వ!

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్​లోని అక్కన్నపేట చౌరస్తాలో డ్రైనేజీ కాలువలో వృద్ధురాలు కాలు జారి కిందపడింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వృద్ధురాలిని బయటకు తీసి.. చికిత్స చేశారు. ప్రాణాపాయం తప్పిన వృద్దురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. ఇంటికి పంపారు.

By

Published : Jun 2, 2020, 11:07 PM IST

Updated : Jun 2, 2020, 11:37 PM IST

Old Women Slept In Drainage In Siddipet District
ఫించన్​ కోసం వచ్చి.. మోరిలో పడిన అవ్వ!

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్​లోని అక్కన్నపేట చౌరస్తాలో ఓ వృద్ధురాలు డ్రైనేజీ కాలువలో పడింది. అది గమనించిన స్థానికులు వెంటనే వృద్ధురాలిని నుంచి బయటకు తీసి.. ప్రథమ చికిత్స అందించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. డ్రైనేజీ మీద మూత లేకపోవడం వల్లనే వృద్ధురాలు కాలు జారి కాలువలో పడిందని స్థానికులు తెలిపారు. హుస్నాబాద్​ మండలం మడద గ్రామానికి చెందిన బండారి రామవ్వ అనే వృద్ధురాలు ఫించన్​ డబ్బుల కోసం పట్టణానికి వచ్చినట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో వృద్ధురాలి తలకు, కాలికి గాయాలయ్యాయి.

Last Updated : Jun 2, 2020, 11:37 PM IST

ABOUT THE AUTHOR

...view details