తెలంగాణ

telangana

ETV Bharat / state

'అధిక ఆదాయం వచ్చే పంటలను పండిద్దాం'

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో 422 మందికి పట్టాదారు పాసు పుస్తకాలను, 28 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి హరీశ్​రావు పంపిణీ చేశారు.

By

Published : Sep 25, 2020, 9:25 PM IST

'అధిక ఆదాయం వచ్చే పంటలను పండిద్దాం'
'అధిక ఆదాయం వచ్చే పంటలను పండిద్దాం'

సంప్రదాయ పంటలు కాకుండా... అధిక ఆదాయం వచ్చే పంటలు పండించాలని మంత్రి హరీశ్​రావు అన్నారు. విత్తనోత్పత్తి కేంద్రంగా సిద్దిపేటను మార్చుకుందామని మంత్రి సూచించారు. రైతులకు ఆదాయాభివృద్ధి పెరిగేలా... ప్రజాప్రతినిధులు కృషి చేయాలని హరీశ్​రావు కోరారు.

సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో సిద్దిపేట రూరల్, నారాయణరావు పేట మండలాలకు చెందిన 422 మందికి పట్టాదారు పాసు పుస్తకాలను, నారాయణరావుపేట మండలంలోని 28 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకు ముందు చిన్నకోడూరు మండలం పెద్దకోడూరులో 590 మందికి పట్టాదారు పాసు పుస్తకాలు, వర్షాలకు ఇళ్లు కూలిపోయిన 267 మందికి రూ.3,200 చొప్పున చెక్కులను అందజేశారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​లో బాలు గానం.. 52 రోజుల్లో రూ.20 లక్షలు

ABOUT THE AUTHOR

...view details