తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వాస్పత్రిలో మాస్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాస్కులు పంపిణి చేశారు. జెడ్పీటీసీ రవీందర్​రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్య సిబ్బందికి, రోగులకు వెయ్యి మాస్కులను ఎమ్మెల్యే అందజేశారు.

By

Published : Jul 15, 2020, 11:08 PM IST

ప్రభుత్వాస్పత్రిలో మాస్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే
ప్రభుత్వాస్పత్రిలో మాస్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే వైద్య సిబ్బందికి, రోగులకు దుబ్బాక జెడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి మాస్కులను ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వైద్య సిబ్బందికి అందజేశారు.

వైద్య సిబ్బందితో పాటు ఆస్పత్రికి వచ్చే రోగులకు కూడా మాస్కులు పెట్టుకోవాలని, కరోనా నివారణకు తోడ్పడాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. జెడ్పీటీసీ తనవంతుగా వెయ్యి మాస్కు​లను ఆస్పత్రికి అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ ఛైర్​పర్సన్ వనిత, ఎంపీపీ పుష్పలత, ఆస్పత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details