తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం దత్తత గ్రామంలోని చెరువుల్లో చేపపిల్లలు వదిలిన కలెక్టర్​

సీఎం కేసీఆర్​ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలోని చెరువుల్లో సిద్దిపేట జిల్లా పాలనాధికారి వెంకట్రామ రెడ్డి లక్ష చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటయ్య పాల్గొన్నారు.

By

Published : Jul 19, 2020, 4:58 PM IST

Collector left fish in ponds at Erravalli in siddipet district
సీఎం దత్తత గ్రామంలోని చెరువుల్లో చేపపిల్లలు వదిలిన కలెక్టర్​

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్ మండలంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలోని పాండురంగ చెరువు, ఎర్రకుంట, మాచిరెడ్డి కుంట, నల్లకుంట చెరువుల్లో గ్రామస్థుల సహకారంతో చెరువులో దాదాపు లక్ష చేప పిల్లలను జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి వదిలారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటయ్య, తహసీల్దార్ ఆరీఫా, ఎర్రవల్లి గ్రామ ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ కులస్థులు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details