తెలంగాణ

telangana

By

Published : Dec 20, 2019, 3:02 PM IST

ETV Bharat / state

'నూతన మున్సిపల్​ కార్యాలయాన్ని పట్టణానికి దగ్గరలో నిర్మించాలి'

హుస్నాబాద్​లో నూతన మున్సిపల్​ కార్యాలయ భవనాన్ని పట్టణానికి దగ్గరలో నిర్మించాలని కోరుతూ భాజపా నాయకులు ధర్నాకు దిగారు. మున్సిపల్ కమిషనర్​కు వినతి పత్రం అందజేశారు.

BJP ACTIVISTS PROTEST In Husnabad, Siddipet district
'నూతన మున్సిపల్​ కార్యాలయాన్ని పట్టణానికి దగ్గరలో నిర్మించాలి'

'నూతన మున్సిపల్​ కార్యాలయాన్ని పట్టణానికి దగ్గరలో నిర్మించాలి'

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో నూతన మున్సిపల్​ కార్యాలయ భవనాన్ని పట్టణానికి దగ్గరలో నిర్మించాలని కోరుతూ భాజపా నాయకులు మున్సిపల్​ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్​కు వినతి పత్రం అందజేశారు.

ప్రస్తుతం నిర్మిస్తున్న స్థలం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ఏ చిన్న అవసరానికైన అంత దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. భవన నిర్మాణ విషయంలోఇప్పటికైనా ఎమ్మెల్యేపునరాలోచించాలని కోరుతూ... ప్రస్తుతం ఉన్న చోటులోనే బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను అడ్డుకొంటామని హెచ్చరించారు. అవసరమైతే మున్సిపల్ డైరెక్టర్​తో ఎంపీ బండి సంజయ్​తో మాట్లాడించి పనులను నిలిపివేయిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details