తెలంగాణ

telangana

By

Published : Nov 2, 2019, 3:32 PM IST

ETV Bharat / state

శుభకార్యానికి వెళ్లొచ్చే లోపు దోచేశారు..

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం అర్ధరాత్రి సిద్దేశ్వర బుక్ షాపులో 20వేల నగదు చోరీ జరిగిందని సమాచారం.

శుభకార్యానికి వెళ్లొచ్చే లోపు దోచేశారు..

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు పంజా విసిరారు. సిద్దేశ్వర బుక్ షాపు తాళం పగలకొట్టి 20 వేల నగదును దోచుకెళ్లారు. యజమాని ఓ శుభకార్యానికి హైదరాబాద్​ వెళ్లొచ్చి చూసేసరికి ఈ చోరీ జరిగింది. షాపులోని 20 వేల నగదు దోచుకెళ్లారని బాధితులు చెబుతున్నారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల హుస్నాబాద్ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాళం వేసి ఊర్లకు వెళ్లాలంటే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

శుభకార్యానికి వెళ్లొచ్చే లోపు దోచేశారు..

ఇదీ చూడండి : కాళ్లు వణికే పయనం.. కళ్లు తిరిగే గమనం...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details