తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాటిన మొక్కలను సంరక్షించాలి'

నాటిన ప్రతి మొక్కను బతికించుకుంటేనే హరితహారం లక్ష్యం నెరవేరుతుందని ఎమ్మెల్యే మానిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవిందపూర్, అనేగుంట గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.

By

Published : Aug 10, 2019, 4:02 PM IST

'నాటిన మొక్కలను సంరక్షించాలి'

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవిందపూర్, అనేగుంట గ్రామాల్లో ఎక్సైజ్​శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మానిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ పాల్గొని ఈత మొక్కలు నాటారు. గత రెండేళ్లుగా హరితహారంలో మొక్కలు నాటుతున్నా వాటిని రక్షించక పోవడం బాధకరమని ఫరీదుద్దీన్ విచారం వ్యక్తం చేశారు. మొక్కలు నాటుతున్న సిబ్బందికి బాధ్యతలు అప్పగించి సంరక్షించాలని ఆదేశించారు. చెరువుగట్టు సమీపంలో దర్గాను దర్శించుకుని ప్రార్థనలు చేశారు.

'నాటిన మొక్కలను సంరక్షించాలి'

ABOUT THE AUTHOR

...view details