తెలంగాణ

telangana

ETV Bharat / state

పెళ్లి ఇంట విషాదం... ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రేమ జంట బలవన్మరానికి పాల్పడింది. పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవటం వల్ల కంగ్టి మండలం చప్టాకు చెందిన రవి, అనిత ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియుడు రవి పొలంలో ఉరి వేసుకుని చనిపోగా... విషయం తెలుసుకున్న ప్రియురాలు అనిత ఇంట్లో కిరోసిన్ పోసుకుని.. నిప్పంటించుకుని చనిపోయింది.

By

Published : May 12, 2019, 8:56 PM IST

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చప్టాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. వారి ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులు తొలుత అంగీకరించలేదు. అనంతరం ఒప్పుకుని ఈ నెల 31న పెళ్లి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అబ్బాయి ఇంట్లో చిన్న గొడవ జరిగింది. మనస్తాపానికి గురై అబ్బాయి రవి పొలంలో చెట్టుకు ఊరి వేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన అమ్మాయి అనిత ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. వీరు ఇరువురు కంగ్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమికులు చనిపోవటం వల్ల విషాద ఛాయలు అలముకున్నాయి.

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details