తెలంగాణ

telangana

By

Published : Feb 9, 2020, 4:00 PM IST

ETV Bharat / state

పొదల్లో హత్య చేసి కాల్చి చంపారు

సంగారెడ్డి శివారులో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని హత్య చేసి కాల్చి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు.

Killed and shot in the bushes at sangareddy
పొదల్లో హత్య చేసి కాల్చి చంపారు

సంగారెడ్డి మండలం కల్పగూరు గ్రామానికి చెందిన క్రిష్ణ(32)అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు పొదల్లో హత్య చేసి కాల్చి చంపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

క్రిష్ణ ఈనెల 5న అదృశ్యమైనట్లు పటాన్​చెరు పోలీస్​స్టేషన్​కుఫిర్యాదు వచ్చిందని, ఆయన తోషిభా పరిశ్రమలో కార్మికునిగా పని చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. కుటుంబ సభ్యులు తమకు ఎవరితో శతృత్వం లేదని.. ఎవరు ఇలా చేశారని కన్నీరుమున్నీరవుతున్నారు.

పొదల్లో హత్య చేసి కాల్చి చంపారు

ఇదీ చూడండి :జాతర ముగిసినా మేడారానికి పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details