తెలంగాణ

telangana

ETV Bharat / state

ధరలు తగ్గించాలంటూ ఎడ్లబండిపై వినూత్న నిరసన - కార్పొరేట్ శక్తులు

ధరల పెంపునకు నిరసనగా.. ఎడ్లబండిపై గ్యాస్ సిలిండర్, ద్విచక్ర వాహనాలను పెట్టి తిప్పుతూ వినూత్న నిరసన చేపట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కార్పొరేట్ శక్తులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. కేంద్రం వాటిని గుడ్డిగా అమలు పరుస్తోందంటూ సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ విమర్శించారు.

Innovative protest took place in Sangareddy against petrol desel prices
ధరలు తగ్గించాలంటూ.. ఎడ్లబండిపై వినూత్న నిరసన

By

Published : Jan 25, 2021, 4:23 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి ప్రజల రక్తాన్ని పీలుస్తున్నాయని సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ మండిపడ్డారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి స్థానిక ఆర్డీవో కార్యాలయం వరకు ఎడ్లబండిపై గ్యాస్ సిలిండర్, ద్విచక్ర వాహనాలను పెట్టి తిప్పుతూ వినూత్న నిరసన చేపట్టారు.

కేంద్రం కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ అయిందని మహేందర్​ ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలు ఏ నిర్ణయం తీసుకున్నా.. కేంద్రం దాన్ని గుడ్డిగా అమలు పరుస్తోందంటూ విమర్శించారు.

గడిచిన 6 సంవత్సరాల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప ప్రజలకు ఏ న్యాయం చేయలేదని మహేందర్​ మండిపడ్డారు. రూ. 360 ఉండే గ్యాస్ ధర.. 800కు పెరిగిందని గుర్తు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 100కు చేరితే సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని​ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:వైన్‌ షాప్‌లో చోరీ.. రూ. 15 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగుడు

ABOUT THE AUTHOR

...view details