ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలా పోలీస్ స్టేషన్లను.. హరిత పోలీస్ స్టేషన్లుగా తీర్చిదిద్దుతామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జహీరాబాద్ పట్టణ ఠాణాలో హరితహారం నిర్వహించారు. పాలనాధికారి హనుమంతరావు ఆదేశాలతో జిల్లాలోని పోలీస్ స్టేషన్లు, సీఐ, డీఎస్పీ కార్యాలయాల్లో 10 వేల మొక్కలు నాటనున్నట్లు ఆయన తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా సిబ్బందికి బాధ్యతలు అప్పగిస్తానని ఎస్పీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ గణపథ్ జాదవ్, సీఐ సైదేశ్వర్ పాల్గొన్నారు.
హరిత స్టేషన్లుగా మారుస్తాం: ఎస్పీ
పోలీస్ స్టేషన్లను హరిత స్టేషన్లుగా మారుస్తామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ పేర్కొన్నారు. జహీరాబాద్ ఠాణాలో హరితహారం నిర్వహించి.. మొక్కలు నాటారు.
హరిత స్టేషన్లుగా మారుస్తాం: ఎస్పీ