సుల్తాన్పూర్ వద్ద బాహ్యవలయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీ కొట్టిన ఘటనలో ఓ మహిళ సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సాయికాలనీకి చెందిన విజయేందర్ దంపతులు యాదాద్రి నారసింహుని దర్శనానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో సుల్తాన్పూర్ బాహ్యవలయ రహదారిపై వారి కారును వెనుక నుంచి వచ్చిన డీసీఎం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ భూపతిరెడ్డి, విజయేందర్, ప్రవళ్లిక తీవ్రంగా గాయపడ్డారు. కారు పూర్తిగా ధ్వంసమైంది. గమనించిన స్థానికులు సురారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీచూడండి:కోడి కోసం కొడుకును చంపిన తండ్రి