తెలంగాణ

telangana

ETV Bharat / state

దారి తప్పి జనావాసాల్లోకి చేరిన భారీ మొసలి

ఇప్పటిదాకా జనావాసాల్లోకి కోతులు రావడం సర్వసాధారణమైన విషయం. కానీ ఈసారి మెుసలి వచ్చింది. ఇంకేముంది స్థానికులు భయంతో పరుగులు తీశారు. మంజీర జలాశయం పక్కనే ఉన్న సంగారెడ్డి జిల్లా సిరూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

By

Published : Mar 22, 2019, 6:20 PM IST

Updated : Mar 22, 2019, 7:24 PM IST

భారీ కాయాన్ని బంధించి జీపులో తరలించిన సిబ్బంది

జనావాసాల్లోకి వచ్చిన మొసలిని చూసి భయాందోళనకు గురైన స్థానికులు
జలాశయాల్లో నీరు అడుగంటడం మొసళ్లకు సంకటంగా మారుతోంది. మంజీర డ్యాంలో నీరు తగ్గి ఆహార దొరక్క.. బయటకు వస్తున్నాయి. ఇలాగే వచ్చిన ఓ మొసలి...సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం సిరూర్‌ గ్రామంలో కలకలం రేపింది.

అతికష్టం మీద పట్టుకున్న అటవీ సిబ్బంది

స్థానికులు వెంటనే అటవీ శాఖకు సమాచారమిచ్చారు. ఓ చెట్టు పొదల్లో దాక్కున్న మొసలిని సిబ్బంది అతికష్టం మీద బంధించి... సింగూరు జలాశయంలో వదిలేశారు.

వేసవి కాలం అయినందున నీరు లేక ఆహారం కోసం మొసళ్లు బయటకు వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి :మెరుపుదాడులపై మరోమారు దుమారం

Last Updated : Mar 22, 2019, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details