సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో జిల్లా పాలనాధికారి హనుమంతరావు ఆకస్మికంగా పర్యటించారు. ధరణి సర్వేలో భాగంగా ఇంటి నిర్మాణాల వివరాలను పంచాయతీ సిబ్బంది నమోదు చేస్తున్న ప్రక్రియను పరిశీలించారు.
'గ్రామపరిధిలోని ప్రతీ నిర్మాణ వివరాలను పక్కాగా నమోదు చెయ్యాలి'
గ్రామ పరిధిలో ఉన్న ప్రతి నిర్మాణ వివరాలను సిబ్బంది కచ్చితంగా నమోదు చేయాలని సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలో ఆకస్మిక పర్యటన చేసిన ఆయన ధరణి సర్వే కొనసాగుతున్న తీరును పరిశీలించారు.
'గ్రామపరిధిలోని ప్రతీ నిర్మాణ వివరాలను పక్కాగా నమోదు చెయ్యాలి'
గ్రామ పరిధిలోని ప్రతి ఒక్క కుటుంబ యజమాని పేరు, ఆధార్ నంబర్, చరవాణి నంబర్, నిర్మాణం స్వభావం, విస్తీర్ణం కొలతలు తీసుకుని నమోదు చేయాలన్నారు. అన్ని రకాల నిర్మాణాల వివరాలు అంతర్జాలంలో నమోదయితే భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి:ప్రభుత్వరంగ సంస్థల బకాయిలే రూ.200కోట్లు