తెలంగాణ

telangana

పదోతరగతి విద్యార్థి అదృశ్యం

By

Published : Dec 30, 2019, 7:16 AM IST

Updated : Dec 30, 2019, 8:46 AM IST

పదోతరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్లి రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో అతని తల్లి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

boy missing in sangareddy district
పదోతరగతి విద్యార్థి అదృశ్యం

పాఠశాలకు వెళ్లిన బాలుడు రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో పీఎస్​లో తల్లి ఫిర్యాదు చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పోచారం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి నీలేష్ మందిర్ హై స్కూల్​లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 27న పాఠశాలకు వెళ్లి... సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి పాఠశాలకు వెళ్లి విచారించింది. నీలేష్ పాఠశాలకు రాలేదని ఉపాధ్యాయులు తెలిపారు.

చాలా చోట్ల తన కుమారుడి ఆచూకీ కోసం గాలించింది. ఫలితం లేకపోవడంతో పటాన్​చెరు ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పదోతరగతి విద్యార్థి అదృశ్యం

ఇవీ చూడండి: పెళ్లికి వెళ్లి వచ్చేసరికే ఇంటిని దోచేశారు!

Last Updated : Dec 30, 2019, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details