తెలంగాణ

telangana

'పుర ఎన్నికల్లో తెరాసను గెలిపిస్తే అదే పునరావృతమవుతుంది'

By

Published : Jan 13, 2020, 4:46 PM IST

Updated : Jan 13, 2020, 5:29 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు చూసే ప్రజలు తెరాసకు ఓటు వేస్తారని రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్​ ధీమా వ్యక్తం చేశారు.

trs campaign for municipal elections in bandlaguda
'పుర ఎన్నికల్లో తెరాసను గెలిపిస్తే అదే పునరావృతమవుతుంది'

'పుర ఎన్నికల్లో తెరాసను గెలిపిస్తే అదే పునరావృతమవుతుంది'

హైదరాబాద్​ నగరశివారులోని బండ్లగూడ కార్పొరేషన్​లో తెరాస ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ ప్రచారం నిర్వహించారు. చెరుకు బండి యజమాని వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం చెరుకు రసం తీసి కార్యకర్తలందరికీ పంచారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను చేసిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాని, మున్సిపల్​ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే అదే పునరావృతం అవుతుందని తెలిపారు. ఇంటింటికి వెళ్లి కేసీఆర్​ సర్కార్​ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.

Last Updated : Jan 13, 2020, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details